Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రతిపక్షాలపై దాడి ప్రజాస్వామ్యానికే చేటు

చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండించిన తెదేపా నాయకులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నందు తెదేపా కార్యాలయంలో శనివారం సత్యసాయి టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ యరగొండపాళెంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై వైసీపీ గూండాలు రాళ్ల దాడి చేసి భద్రతా సిబ్బందిని గాయపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని దౌర్భాగ్యకరమైన పరిస్థితులను ఈ అరాచక వైసీపీ ప్రభుత్వంలో చూడాల్సివస్తోంది.
ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ పై రాళ్లు విసరడం, భద్రతా సిబ్బంది తలలు పగలగొట్టడం ఎప్పుడైనా చూశామా.ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేబినెట్ మంత్రి చొక్కా విప్పేసి రోడ్లపైకి వచ్చి ఏం సందేశమిస్తున్నారు? మంత్రి చొక్కా ఇప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా బట్టలిప్పేసినట్టే.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేశారు. ఏనాడైనా ఇలాంటి దురదృష్టకర ఘటనలు చూశామా ఇప్పటికే చేసిన హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు మీ సైకో మనస్తత్వ ఆకలి తీర్చలేదా? యరగొండపాళెం ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనీ ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img