Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యన్.సి.సి యూనిట్ మంజూరు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణంలోగల పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి బాలుర యన్.సి.సి యూనిట్ మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీలం రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలకు మొత్తం 102 సీట్లు మంజూరు కాబడ్డాయని తెలిపారు. 2023లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చేరబోవు విద్యార్థులకు మాత్రమే యన్.సి.సి లో చేరడానికి అర్హత ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాసైన విద్యార్థులు కళాశాలకు వచ్చి , యన్.సి.సి. లో చేరడానికి వారి పేర్లను నమోదు చేసుకొనవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img