Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ప్రమాదాల నివారణలో డ్రైవర్ల బాధ్యత కీలకం. వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రమాదాల నివారణలో డ్రైవర్ల బాధ్యత కీలకమని వన్టౌట్ సీఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ధర్మవరం ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం రోడ్డు భద్రత, వాటి నియమావళి, తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలుకువలు గూర్చి తెలియజేశారు. సెల్ ఫోన్ తో డ్రైవింగ్ చేయరాదని, మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయరాదని, జీరో యాక్సిడెంట్ డిపోగా పేరు తేవాలని వారు తెలియజేశారు. ఆర్టీసీ డ్రైవర్ వెనుక పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని, మానసిక ఒత్తిడి లేకుండా, ప్రశాంతమైన మనసుతో విధులను నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్, అసిస్టెంట్ మేనేజర్ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, ఎంసీ. వెంకటేశులు, హెడ్ గార్డ్ రామాంజనేయులు, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి తోపాటు ఆఫీసు సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img