విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహణలో భాగంగా, అనధికార వైద్యం అందిస్తున్నాడు అనే ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టరు నాగలక్ష్మి ఆదేశాల ప్రకారం , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా యుగంధర్ ఉత్తర్వులు మేరకు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో అనంతపురం పట్టణ కేంద్రం లో ఐరన్ బ్రిడ్జి వద్ద వైద్య సేవలు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ బిశ్వాస్, మొలల ఆసుపత్రి కేంద్రాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించగా ఆ సమయంలో అక్కడ ఆపరేషన్లు నిర్వహించడం స్వయంగా గ్రహించి ఫిర్యాదు వాస్తవమని ఏపిఎంసిఈ యాక్ట్ ప్రకారం క్లినిక్ ను సీజ్ చేశారు. అదే విధంగా బోయ వీధి, సున్నపు వీధిలలో తనిఖీ లు నిర్వహించగా అక్కడ ఉన్న ఇతర క్లినిక్లు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఈ కార్యక్రమంలో డెమో భారతి, డిప్యూటి డెమో త్యాగరాజు, సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.