Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం … భర్తే గొంతు కోసిన వైనం

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ట్స్‌ కళాశాలలో మహిళా లెక్చరర్‌పై గురువారం హత్యాయత్నం జరిగింది.కళాశాలలో కామర్స్‌ బోధిస్తున్న ప్రొఫెసర్‌ సుమంగళిని ఆమె భర్త పరేష్‌ గొంతు కోసి పారిపోయాడు. అక్కడే ఉన్న విద్యార్థులు లెక్చరర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img