Friday, April 26, 2024
Friday, April 26, 2024

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే 50 వేలు ఆర్థిక సహాయం….

విశాలాంధ్ర- గుంతకల్లు : ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం మండలంలోని కొంగనపల్లి గ్రామంలో వెంకటేశులు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.అయితే వారి కుటుంబ సమస్యలను తెలుసుకుని నేరుగా ఆయన మృతుడి కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఇలా ప్రతిరోజు మానవత్వాన్ని చాటుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని తన వంతు సహాయం చేస్తున్నాడని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర అనారోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉచితంగా రెండు అంబులెన్స్ లు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాడు. తన సొంత ఖర్చులతో 365 రోజులుగా 5 రూపాయలు బోజనం వైవిఆర్ క్యాంటీన్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా రోగులకు భోజనం అందిస్తున్నాడు. వీటన్నిటిపై ప్రజల మన్ననలు పొందుతూ సేవా కార్యక్రమాలు గణనీయంగా చేస్తున్నాడని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరాం రెడ్డి పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img