Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాయలసీమ హక్కులకై ఈనెల 24న జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయండి

రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం-రాయలసీమ హక్కులకై కర్నూలు పట్టణంలో ఈనెల 24వ తేదీన ఎస్సీఎస్టీ మైదానంలో జరిగే ఒక్క రోజు నిరసన దీక్షను విజయవంతం చేయాలని ధర్మవరం పట్టణంలోని స్పందన ఆసుపత్రిలో డాక్టర్ టి. ఎమ్. బషీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం స్పందన ఆసుపత్రి ఆవరణంలో డాక్టర్ బషీర్ చేతుల మీదుగా రాయలసీమ కర్తవ్య దీక్ష కరపత్రాన్ని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా స్పందన ఆసుపత్రి వైద్యులు బషీర్, రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు ఆర్. వి ఎస్ సీమకృష్ణ,నాగభూషణం మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు నిధులు నియామకలలో సమాన వాటా కోసం రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేయాలని తెలియజేశారు.అధేవిధంగా సిద్దేశ్వరం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్డు కం బ్యారేజ్ నిర్మించాలని మరియు అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం నిర్మించడం వలన రాయలసీమకు తుంగభద్ర నది నుండి రావాల్సిన నికర జలాలు హెచ్.ఎల్.సి,ఎల్ఎల్సి, కేసీ కెనాల్ బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు రైతులకు నీళ్లు రావన్నారు.వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరుతూ.. నీళ్లు,నిధులు, నియామకాల లో న్యాయం చేయాలని ఈనెల 24వ తారీఖున కర్నూలు పట్టణంలోని ఎస్టీ, బీసీ మైదానంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమంను చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్పంధన ఆసుపత్రి మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్, సుధాకర్,రాము,రవింద్ర, నాగభూషణం,బజారి,గోపాల్, రమేష్,సామ్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img