Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్‌యే జనసేన పార్టీ ధ్యేయం..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి
విశాలాంధ్ర..ధర్మవరం: రాష్ట్రంలో వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్‌యే జనసేన పార్టీ ధ్యేయమని, పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యమని, వైసీపీని గద్దె దింపుతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారి స్వగృహంలో విలేకరులతో వారు మాట్లాడుతూ బీజేపీ పెద్దలతో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పలు గఫాలుగా మంతనాలు జరుపుతున్నారని తెలిపారు. ఎందుకంటే ఒక దుర్మార్గమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతారో తెలియజేసి, ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలను తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ విముక్తి కోసం సన్నద్ధం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే బిజెపి పెద్దలతో పవన్‌ కళ్యాణ్‌ సంప్రదించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎప్పుడూ కూడా విమర్శలు చేయడం, చాలెంజ్‌ లు చేయడం కాకుండా నేను అవినీతికి పాల్పడడం లేదని కాణిపాకం స్వామివారి మీద ప్రమాణం చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైఎస్‌ఆర్సిపి పార్టీపై విసుకు చెందారని, జనసేన పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి, ప్రజల కష్టసుఖాలు కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రతిపక్షాలు సమస్యల కోసం పోరాటం చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని దొంగ కేసులు పెట్టడం లాంటివి తాము బెదరబోమని తెలిపారు. ధర్మవరంలో బెదిరింపులు, అక్రమార్చనలు అధికమయ్యాయని ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img