Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర హాకీ పోటీలకు ఎంపిక..

రాష్ట్ర హాకీ ఉపాధ్యక్షులు బంధనాథం సూర్యప్రకాష్
విశాలాంధ్ర -ధర్మవరం : నంద్యాలలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు 13వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర హాకీ పోటీలలో పాల్గొనే శ్రీ సత్యసాయి జిల్లా జూనియర్ బాలుర హాకీ జట్టును ఎంపిక చేసినట్లు రాష్ట్ర హాకీ ఉపాధ్యక్షులు బంధనాథం సూర్యప్రకాష్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎంపిక కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు నిర్వహించడం జరిగిందని, జట్టు సభ్యులకు కెప్టెన్ గా అశోక్ కాగా, జట్టులో రాజేష్, లోకేష్, ఈశ్వర్, మహమ్మద్ రఫీ, వెంకటేష్ నాయక్ ,ప్రశాంత్, బాలు, వంశీ, మహబూబ్ బాషా, జగన్, రూపేష్, చక్రి, రవితేజ ,సునీల్, మహేష్, లావణ్య, కుమార్ నాయక్ శబరీష్ గౌడ్ ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఈ చెట్టుకు కోచుగా హసేన్ మేనేజర్ గా కుశాల్ కుమార్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు అంజన్న, గౌరీ ప్రసాద్, మారుతి కుమార్, ఉడుముల కిరణ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img