Friday, April 26, 2024
Friday, April 26, 2024

వసతి దీవెన నిధులు విడుదల చేయాలి

విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం వసతి దీవెన నిధులు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం నామవాత్రంగా విద్య దీవెన నిధులు మాత్రం ముఖ్యమంత్రి విడుదల చేశారని. ఎన్‌ఎస్‌ యుఐ రాష్ట్ర నాయకులు రేగాటి శివకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిగ్రీ చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 20 వేల రూపాయల వసతి దీవెన కింద అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే మంజూరు చేసిందని మిగిలిన మూడు సంవత్సరాల సంబంధించి విద్యార్థులకి రావలసిన డబ్బులు పెండిరగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయి పడ్డ వసతి దీవెన డబ్బులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు . లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img