విశాలాంధ్ర-రాప్తాడు : నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికనుగుణంగా బాలికలు తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని అనంతపురం లలిత కళా పరిషత్ అధ్యక్షులు గాజుల వెంకటసుబ్బయ్య తెలిపారు.అనూత నెట్వర్క్ సౌజన్యంతో ఎన్కేసీ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రాప్తాడు కేజీబీవీ పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన గాజులు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా విద్యే ఆధారమన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశల్ని ఆశయాలుగా మలుచుకుని కష్టపడి చదవుకోవాలన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, దాతలు అందిస్తున్న స్డడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ ముత్యాలమ్మ, ఎన్కేసీ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్. కమలనాథ్, తోట నాగరాజు, ఉపాధ్యాయురాలు సుధ తదితరులు పాల్గొన్నారు.