Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయండి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు పరిధిలో ని శివరామ రెడ్డి కాలనీలో తక్షణం విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలని అవార్డు సభ్యులు వశీకేరి మల్లికార్జున ఉరవకొండ విద్యుత్ శాఖ ఏఈ గురుమూర్తుకు వినతిపత్రాన్ని అందజేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి పలు విద్యుత్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ శివరామిరెడ్డి కాలనీలో అనేక వీధులలో విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల కట్టెలను పాతి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం జరిగిందని దీనివల్ల తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని వర్షాకాలంలో విద్యుత్ తీగలు కిందపడే అవకాశం ఉందని ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై ఏఈ గురుమూర్తి కూడా స్పందిస్తూ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారిస్తామని హామీ ఇచ్చినట్లు వార్డు సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img