Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వెలుగు యానిమేటర్ మోసం చేసిందంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ వెలుగు కార్యాలయంలో యానిమేటర్ గా పని చేస్తున్న వహీదా తన పేరు మీద మంజూరైన లక్ష రూపాయల డబ్బులు తనుకు ఇవ్వకుండా మోసం చేసిందని బాబా మహిళా సంఘం సభ్యురాలు లక్ష్మీదేవి సోమవారం వెలుగు కార్యాలయం ముందు పురుగులు మందు డబ్బా చేతబట్టి నిరసనకు దిగింది తనుకు న్యాయం జరగకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ బాబా మహిళా సంఘానికి డిసెంబర్ నెలలో పది లక్షల రూపాయలు రుణం మంజూరు అయిందని డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత కార్యాలయంలో సాయంత్రం డబ్బులు పంపిణీ చేసుకుందామని సంఘానికి మంజూరైన డబ్బులు వహీదా తీసుకుని వెళ్లిందని 20 రోజులు కావొస్తున్న తమ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించింది. తనకు పెద్ద ఎత్తిన రాజకీయ పలుకుబడి ఉందని తాను ఎవరికి డబ్బులు ఇవ్వనని తనను ఎవరు కూడా ఏమీ చేయలేరని మా పైనే దబాయింపు కొనసాగిస్తుందని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే నిరసన తెలియజేస్తానని ఆమె భీష్మించుకు కూర్చుంది అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఉన్నతాధికారులతో తాము చర్చించి విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img