Friday, April 26, 2024
Friday, April 26, 2024

శ్రీ బాలాజి ఎం.బీ.ఏ కళాశాలలో ఘనంగా స్వాగతదినోత్సవం

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ : శ్రీబాలాజి పీజీ ఎం బీ ఏ కళాశాలలో జూనియర్ ఎం.బీ.ఏ. విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సోమవారం ఘనంగా స్వాగత్సవాన్ని నిర్వహించారు. కళాశాల చైర్మన్ పల్లె కిషోర్ మాట్లాడుతూ . జీవితంలో విద్యతో పాటు ఆరోగ్యము , ఆట పాటలతో కళాశాల జీవితాన్ని ఆస్వాదించవలెనని అన్నారు. కళాశాల కోశాధికారి , డైరెక్టర్ పల్లె సింధూర మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం సాధనతో విజయ ఫలాలను సాధించాలన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను అలరించాయి. కళాశాలలో నిర్వహించిన పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకఅధికారి ఆచార్య శ్రీనివాసులు రెడ్డి,యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, శ్రీ బాలాజీ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డా.ఏం. సుబ్బారావు, ఎం.సి.ఏ కళాశాల ప్రిన్సిపల్ డా. మన్మదేశ్వర్ రెడ్డి, విభాగాధిపతి పవన్ కుమార్ , కళాశాల సిబ్బంది సునీల్, తాయిరెడ్డి, సాయి పరిమళ, అయేషా, షాను, ఎర్రిస్వామి, విజయ్ పాల్గోన్నారు. 01.. మాట్లాడుతున్న కళాశాల చైర్మన్ పల్లె కిషోర్.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img