విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని 11వ వార్డు తో పాటు అనేక వార్డులలో తాగునీటి, పారిశుధ్య సమస్యలు నెలకున్నాయని వాటిని తక్షణ పరిష్కరించాలని కోరుతూ సోమవారం 11 వార్డుకు చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎం జిలాన్ భాష, రఫీక్ ఆధ్వర్యంలో ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 11 వార్డులో కొండప్ప బావి వెనక గత ఐదు నెలలుగా తాగు నీటికి సంబంధించిన మోటర్ చెడిపోవడంతో ఆ కాలనీ ప్రజలు నీటి కోసం ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడ కొత్త సిస్టం ఏర్పాటు చేసి నీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. పార్కు ఆంజనేయస్వామి గుడి సమీపంలో ప్రాథమిక పాఠశాల వద్ద అపరిశుభ్రత నెలకొన్నదని దీనివల్ల విద్యార్థులకు రోగాల ప్రభలే అవకాశం ఉన్నందున తక్షణమే ఎక్కడ మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీలకు చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు