Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీఎం జగన్ అండతోనే దళితులపై దాడులు

టిడిపి ఎస్సీ సెల్ నాయకులు ఎం. రామాంజనేయులు

విశాలాంధ్ర – ఉరవకొండ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతోని ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలోనే దళిత టిడిపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి పై సోమవారం వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడం శోచనీయమని రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి దినంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఎం. రామాంజనేయులు అన్నారు. సోమవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. గతంలో ఒక ప్రభుత్వ డాక్టర్ కరోనా సమయంలో ఎన్95 మాస్క్ కావాలని అడిగినందుకు దళిత డాక్టర్ను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు జరగడమే కాకుండా వారి ఉపాధి అవకాశాలు కోసం ఏర్పాటు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ సైతం నిర్వీర్యం చేశారన్నారు. దళితులతొ పాటు ఎస్టీ, బీసీలు కార్పొరేషన్లను ఎత్తివేసి ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని ఆరోపించారు. దళితులు బడుగు బలహీన వర్గాలపై సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా దళిత, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img