విశాలాంధ్ర `అనంతపురం వైద్యం : శ్రీ లక్ష్మి హైయగ్రీవ, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర, శ్రీ గోదా రంగనాధ స్వామి ఆలయం శ్రీ క్షేత్రం తపొవనంలొ ఈ నెల 16 వ నుండి ప్రారంభమగు ధనుర్మాసం సందర్బంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రొజు శ్రీ గోదారంగనాధ స్వామి ఆలయంలొ శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీవైష్ణవ తిరుమాలిగలలొ అత్యంత భక్తి శ్రద్దలతొ ధనుర్మాస వ్రతంగా శ్రీ గోదారంగనాధ స్వామి తిరువారదన కైంకర్యములు డిసెంబర్ 16 వ తేదీ నుండి జనవరి 14 వ తేది వరకు ఆలయంలొ రోజు ఉదయము 6:00 తిరుప్పావై సేవా, తిరుపల్లాండ్ సేవా, సాయంత్రం 6:00 నుండి శ్రీ లక్ష్మి అష్టోతరములు, శ్రీ విష్ణు సహస్రనామము పారాయం, తిరుప్పావై పారాయణం, మహామంగళారతి జరుగును కావున భక్తాదులందరు రోజు ఆలయంకు విచ్చేసి స్వామి వారి అమ్మవారి కృపాకటాక్షాలు పొందవలెనని ఆలయ కమిటి చైర్మెన్ జ్వాలాపురం శ్రీకాంత్ తెలియజేశారు. రొజు పూజలకు సంబందించినటువంటి కరపత్రాలను ఆలయంలొ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలొ అంబాలం రఘునాధ్,అయ్యంగార్, ఆలయ ప్రదాన అర్చకుడు భరద్వాజ్, మధు, మహిళా సభ్యులు విష్ణు శ్రీమతి, చేతన, శైలజ, దన్విత, విజయలక్ష్మి, రఘు తదితర సంఘ సభ్యులు పాల్గోన్నారు