Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

42 అంగన్వాడి భవనాలు మంజూరు

ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
విశాలాంధ్ర` ఉరవకొండ :
ఉరవకొండ నియోజకవర్గంలో42 నూతన అంగన్వాడి కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ అనుమతులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 64 అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల ఇబ్బందులకి గురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు తక్షణమే స్పందించి వజ్రకరూరు మండలానికి సంబంధించి 14 విడపనకల్లు కు 10 ఉరవకొండ మండలంలో 18 అంగన్వాడి కేంద్రాల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, నాబార్డ్‌, నాడు- నేడు పథకాలు కింద నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన 22 నూతన భవనాలు కూడా త్వరలోనే నాడు -నేడు పథకం కింద మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి మరియు మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను,మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన తెలిపారు. నూతన భవనాల మంజూరు కి అనుమతులు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img