విశాలాంధ్ర అనంతపురం : అనంతపురము జిల్లా వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షులు ఎం. జి రాజు ఆధ్వర్యంలో జగజ్యోతి బసవేశ్వరుల 918వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని హోటల్ ఎదురుగా ఉన్న జగత్ జ్యోతి బసవేశ్వర విగ్రహానికి అధ్యక్షులు యం. జి. రాజు, ప్రధాన కార్యదర్శి గౌలి సతీష్ కుమార్, కోశాధికారి జి. మల్లికార్జున పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పాతూరు లోని పేట బసవేశ్వర స్వామి దేవాలయంలో
శ్రీ బసవేశ్వరుల జయంతి మహోత్సవ సందర్భంగా
ఉదయం 7-00 గంటల నుంచి శ్రీ పేట బసవేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకము, ఆకుపూజ, విశేష పూజాలంకరణ, మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎం.జి రాజు మాట్లాడుతూ… సాధారణ ఎన్నికలు కోడ్ నిబంధనలు వలస శ్రీ బసవేశ్వర జయంతిలో భాగమైన ఉరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం వీలు కాలేదని ఆయన పేర్కొన్నారు. పేట బసవేశ్వర స్వామి దేవాలయంలో వీరశైవ సమాజ సభ్యులు విశేష పూజలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాంబశివ, బసవరాజు, ఉమా శంకరు, రవి,ప్రకాష్, ధనుంజయ్, జంగమ సమాజా అధ్యక్షులు మఠం తిప్పేస్వామి, చంద్రభూషణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.