Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రమాదంలో విద్యార్థి ప్రయాణం ప్రాణాలతో చెలగాటం

విశాలాంధ్ర – శిరివెళ్ల : మండల పరిధిలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రమాదం అంచున ప్రయాణాలు కొనసాగిస్తున్నారని రహదారి భద్రత అధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి ఆటో డ్రైవర్ల ఆగడాలను అదుపు చేయాలని ఎమ్మార్పీఎస్ నంద్యాల డివిజన్ నాయకులు బి మారెన్న పేర్కొన్నారు. మండల పరిధిలోని బోయలకుంట్ల గ్రామం లో ఆయన శనివారం మాట్లాడుతూ వచ్చె కొద్దిపాటి రూపాయలకు ఆశపడి పాఠశాల విద్యార్థులను కెపాసిటీకి మించి పాఠశాలలకు రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు రహదారి భద్రత మరియు విద్యాశాఖ పర్యవేక్షణ అధికారులు స్పందించి ఆటో డ్రైవర్ల అధిక లోడు అరికట్టి ప్రమాదాలు జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మారిన్న సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img