Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పూర్వ విద్యార్థులు గ్రంథాలయమునకు నూతన పుస్తకాల వితరణ

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్ వీధిలో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయమునకు మంగళవారం శ్రీ నాగార్జున స్కూలుకు చెందిన 2004-05 బ్యాచ్ విద్యార్థులు మహేష్, రవి ప్రకాష్ తదితరులు పదివేల రూపాయలు విలువచేసే 20 కాంపిటీటివ్ పుస్తకాలను విరాళంగా అందజేశారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కాంపిటేటివ్ పుస్తకాలు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎంతగానో ఉపయోగపడతాయని, వివిధ పోటీలకు మరింత జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చునని తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు తోపాటు పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజారెడ్డి, రామాంజి, గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, గంగాధర్, శివమ్మ, పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img