Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బిజెపి నాయకులు లేనిపోని ఆరోపణలు మానుకోవాలి

టిడిపి శ్రేణులు
విశాలాంధ్ర ధర్మవరం:: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయ్ కుమార్ పై బిజెపి నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టిడిపి నాయకులు సీన, చిత్ర రామ్మోహన్, గొట్లూరు అనిల్, గుత్తి అనిల్, పల్లపు రవీంద్ర, ఇర్షాద్, బాబావాలి, కుళ్లాయప్ప, ఇజ్రాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గంలో ఎగిరేది తెలుగుదేశం జెండా నే నని తెలిపారు. బిజెపి పెయిడ్ ఆర్టిస్టులతో పేటీఎం బ్యాచులతో చెప్పించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదని తెలిపారు. 2019 ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి బలహీన పరచాలని చూసింది ఎవరు? అని వారు ప్రశ్నించారు. ఆ కష్ట సమయంలోనే పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే కాపాడుకున్నారని వారు తెలిపారు. కనీసం రాజకీయంపై అవగాహన లేని వారితో మాట్లాడించడం, చూస్తూ ఉంటే వారి దిగజారుడుతనం ఎంత మేరకు ఉంది? అనేది ఇట్టే అర్థమవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో ధర్మవరంలో వైఎస్ఆర్సిపి పై పోరాటం చేస్తున్నది ఎవరు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ను గెలిపించుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img