Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రారంభమైన చలివేంద్రం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కాగితాల వీధిలో ప్రణవ సాయి స్కూల్ సమీపాన వృద్ధుల సంరక్షణ కేంద్రం వద్ద శుక్రవారం చలివేంద్రమును ప్రణవ సాయి పాఠశాల విద్యార్థులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య నిర్ధారణ మాట్లాడుతూ రానున్న ఎండాకాలమునకు ఈ చలివేంద్రం వృద్ధులకు, బాటసారులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఎండాకాలమును దృష్టిలో ఉంచుకొని, చలివేంద్రాలను వెనివెంటనే ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కిషోర్ ,అంబటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img