Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు సహకరించండి

విశాలాంధ్ర- బ్రహ్మసముద్రం : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు సహకరించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మునుపు అనేక హామీలు ఇచ్చి ఉద్యోగులకు నిరుద్యోగులకు మొండి వైఖరి అవలంబించిందని నిరుద్యోగులు ఉద్యోగులు ఓటు వేసి గెలిపిస్తే అన్నిటిలోనా నట్టేట ముంచారన్నారు. వామపక్ష భావాలు కలిగిన తమకు ఓటు వేసి గెలిపించాలని వారి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గోపాల్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర ప్రసాద్ సురేష్ ఉద్దీప్ సింహ బాలా శీన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img