Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 40వ వార్డులోనూ, పదవ వార్డు టిడిపి ఇన్చార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదినం,రంజాన్ పండుగ సందర్భంగా గురువారం 800 మంది ముస్లిం మహిళలకు చీరలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయ్ కుమార్, కమతం కాటమయ్య, టిడిపి నాయకులు పనీ కుమార్, చేతులమీదుగా పంపిణీ చేశారు. ముందుగా చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు తదుపరి ముస్లింల మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పని కుమార్, పరిసే సుధాకర్,అంబటి సనత్, నాగూర్ హుస్సేన్, మారుతి స్వామి, దేవరకొండ రామకృష్ణ, అత్తర్ రహీం భాష, గంగారపు రవి, బొట్టు కృష్ణ, ఓంకార్ ,కొత్తపేట ఆది, టైలర్ కుల్లాయప్ప, ఇర్షాద్, చికెన్ రాము, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక టిడిపి కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు, అభిమానుల మధ్య చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తొలుత కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పంపిణీ చేశారు. అనంతరం టిడిపి శ్రేణులు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో తనదైన శైలిలో సత్తా చాటిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి మహేష్ చౌదరి, మేకల రామాంజనేయులు, చింతపులుసు పెద్దన్న, పల్లపు శివశంకర్, రహీం భాష, కే. శీన, చీమల నాగరాజు, అడ్ర మహేష్, మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నార

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img