Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి: ఏపీయూడబ్ల్యూజే

కలెక్టరేట్ ఏవో కు వినతి పత్రం అందజేత
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఈ నెలాఖరుతో రెన్యువల్ చేసిన అక్రిడిటేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఏపీయూడబ్ల్యూజే) జిల్లా కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్, కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇవాళ కలెక్టరేట్ లో ఈ మేరకు కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. అక్రిడిటేషన్లను రెన్యువల్ చేయాల్సివస్తే 2021లో ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంజూరు చేసిన అన్నింటిని నిబంధనలు పక్కనపెట్టి బేషరతుగా రెన్యువల్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. అక్రిడిటేషన్ ల మంజూరు కోసం వచ్చే కొత్త కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న, అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img