Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏకగ్రీవంగా నూతన మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలో నూతన మున్సిపాలిటీ చైర్మన్గా ఆరో వార్డ్ కౌన్సిలర్ కాచర్ల లక్ష్మి ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగిందని గురువారం నిర్వహించిన నూతన చైర్మన్ ఎంపిక సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఇటీవలే గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల రాజీనామా చేయడంతో నూతన చైర్మన్ ఎంపిక ప్రక్రియ చట్టం ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో 11వ వార్డు కౌన్సిలర్ అత్తర్ జిలాన్ భాష,15వ కౌన్సిలర్ కుండా మీనాక్షయలు బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి ఎన్నికల అధికారి ఆర్డీవో తిప్పేనాయక్ కాచర్ల లక్ష్మికి చైర్మన్ నియామక పత్రాన్ని సమావేశంలో అందరి సమక్షంలో అందజేశారు. తదుపరి ఎన్నికల అధికారి, ఆర్డిఓ తిప్పే నాయక్, కాచర్ల లక్ష్మీ చేత ప్రమాణస్వీకారాన్ని చేయించారు. తదుపరి ఎన్నికల అధికారి తో పాటు కమిషనర్ బండి శేషన్న, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మవరం మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో ఉన్న చైర్మన్ లింగం నిర్మలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో, అదేవిధంగా నూతన మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మికి కూడా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యులు అందించాలని వారు కోరారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపాలిటీ అధికారులు నూతన చైర్మన్ కాచర్ల లక్ష్మికి అభినందన శుభాకాంక్షలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్, ఆర్ఓ- ఆనంధ్, మున్సిపల్ ఈఈ సత్యనారాయణ, డి ఈ వన్నూరప్ప, శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img