Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి

విశాలాంధ్ర ఆస్పరి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం పత్తికొండలో నిర్వహించే బాదుడే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతున్నారన్నారు. అనంతరం ఆస్పరి మీదుగా ఆదోనికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. కావున పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగపు రాష్ట్ర కార్యదర్శి ముత్యాల రెడ్డి, మాజీ డైరెక్టర్లు కృష్ణ యాదవ్, సుదర్శనం, ఎస్ తిమ్మన్న, సర్పంచ్ అంజినయ్య, ఎంపీటీసీ రహీంతుల్లా, మహేష్, రాజ్ కుమార్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img