Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం:: ముస్లిం మైనారిటీల సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గ కమిటీలో స్థానం పొందిన మైనారిటీ నాయకులు పరిటాల శ్రీరాములును శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో మైనారిటీలకు ఇచ్చే పథకాలను నేటి జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ విషయాన్ని మైనారిటీ నాయకులు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వారిని చైతన్యవంతులుగా చేసి, ప్రభుత్వ తప్పిదాలను తెలిసేలా చూడాలని తెలిపారు. మైనారిటీలకు రద్దు చేసిన 18 పథకాలను పునరుద్దించాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేలా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు నాగూర్ హుస్సేన్, పటాన్ బాబు ఖాన్, రాళ్లపల్లి షరీఫ్, కృష్ణాపురం జమీర్ భాష, అత్తర్ రహీం భాష, మాబు, బాబావలి, కుళ్లాయప్ప, ఉస్మాన్, అన్వర్, ఇమామ్, బాబా ఫక్రుద్దీన్, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img