విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 5వ వార్డులో ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి పర్యటించారు. వార్డులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ తక్షణ సమస్యపరిష్కారానికి అధికారులకు ఆదేశించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు రామాంజనమ్మకి ఆయన 20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆమె కుటుంబానికి అండగా నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎద్దుల శంకర్,లింగన్న,నాయుడు తదితరులు పాల్గొన్నారు.