Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సమాజ సేవలో ఎన్ఎస్ఎస్ పాత్ర కీలకం.. ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్

విశాలాంధ్ర -ధర్మవరం : సమాజ సేవలో ఎన్ఎస్ఎస్ పాత్ర కీలకమైనదని, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ముందడుగులో ఉందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా మండల పరిధిలోని గో ట్లురు గ్రామంలోఁవిద్యతో ఉపాధి లేని యువతపైఁఆరవ రోజు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య యువతపై సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యతో ఉపాధి లేని యువతపై అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం విద్యతోపాటు సేవా కార్యక్రమాల యొక్క ప్రాధాన్యతను కూడా వివరించడం జరిగిందన్నారు. సర్వే తో పాటు అక్కడ ఉన్నటువంటి యువతకు తగు సందేశాలను, సూచనలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆనందు, రామ్మోహన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img