Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర – ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, వారి ఆశయ సాధనాల కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన పౌర శాఖ గ్రంథాలయం అధికారిని అంజలి సౌభాగ్యవతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ గ్రంథాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పాఠకుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి వారి చిత్రపటానికి అంజలి సౌభాగ్యవతి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులైన వారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు వంటి నిస్వార్ధపరులైన దేశభక్తులు ఆనాడు ఉండేవారని అందులో పొట్టి శ్రీరాములు ఒకరిని తెలిపారు. అందుకే పొట్టి శ్రీరాములు స్వార్థ రాహిత్యము, మొండి, పట్టుదల, నిరాడంబరత, మొక్కవోని నమ్మకం, ఆగని పరిశ్రమ, సూక్ష్మమైన బుద్ధి, వగైరా మరొకరితో ఆ స్థాయిలో కనపడవని తెలిపారు. పొట్టి శ్రీరాములు సాధించిన తెలుగు రాష్ట్రంలో మనమందరము ఉండడం చాలా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, అధిక సంఖ్యలో పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img