విశాలాంధ్ర-గుంతకల్లు : రాటు తేలిన కుక్కల దాడులకు భయాందోళనలకు గురవుతున్న ప్రజలు శీర్షికన విశాలాంధ్ర ప్రచురించిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు.పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు బంయాందోలనకు గురవుతున్నా సమస్యలను విశాలాంధ్ర వివరించింది. గురువారం మున్సిపల్ కమిషనర్ బండి శేశన్న స్పందించి మార్కెట్ యార్డ్ లో కుక్కలకు ఇంజేక్షన్ ఆపరేషన్ లు నివారణ చేయించారు. ప్రజా సమస్యలను కళ్లకు కట్టినట్లు ప్రచురించడంతో సమస్య పరిష్కారమైందని స్థానికులు తెలిపారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి దగ్గరుండి పనులు ఇంజెక్షన్ లు చేయించారు.