Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సొంత నిధులతో రోడ్డుమరమ్మత్తులు

విశాలాంధ్ర-తాడిపత్రి: గన్నెవారి పల్లె కాలనీలోని హీరో షోరూమ్ ప్రక్క సందులో రోడ్డు మరమ్మతులు చేయించినట్లు జెడ్పిటిసి వెంకట రమణమ్మ వైసిపి నాయకుడు రామ్ శేఖర్ చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో రోడ్డు గుంతపడడం వల్ల రాత్రి సమయాలలో వృద్ధులు, మహిళలు వాహనదారులు తిరగాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి ఉడత భక్తిగా తమ సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తులు చేయించామని తెలిపారు. ఈ కార్య క్రమంలో వైసీపీ నాయకులు ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి, శివ,రాజా రెడ్డి, ఆనంద్, విజయ్,దస్తగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img