Friday, April 26, 2024
Friday, April 26, 2024

శ్రీ లలిత నాట్య కళానికేతన్కు అవార్డులు కైవసం

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల బెంగళూరులోని యలహంకలో గల అంబేద్కర్ భవన్లో వాగ్దేవి సంస్థ వారు నిర్వహించిన కార్తీక నృత్యోత్సవములో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్.. బాబు బాలాజీ ,కమలా బాలాజీ, వారి శిష్య బృందముల వారికి అవార్డుల ను కైవసం చేసుకున్నారు. శిష్య బృందం వారు ప్రదర్శించిన నాట్య ప్రతిభను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నాట్య ప్రతిభలో రామ లాలిత్య ప్రదర్శించిన వారితో పాటు 11 మంది నాట్య కళాకారులను కార్తీక నంది అవార్డులు ప్రధానం చేశారు. అనంతరం నాట్య గురువులైన బాబు బాలాజీ, కమలా బాలాజీలను వాగ్దేవి సంస్థ వారు సన్మానించి, నాట్య నంది అవార్డులను కూడా ప్రధానం చేస్తూ, ఘనంగా సత్కరించారు. గురువులకు, శిష్య బృందమునకు అవార్డులు రావడం పట్ల, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img