Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

బొడ్డేపల్లి గేటు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేయాలి

  • జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ డిమాండ్


విశాలాంధ్ర – పొందూరు ( శ్రీకాకుళం): మండలం లోని బొడ్డేపల్లి రైల్వే గేటు సమీపంలో నిర్మించిన అండర్ పాస్ లో చిన్న పాటి వర్షానికే నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది అని, నీరు నిలువ లేకుండా ఉండేలా పనుల పూర్తి చెయ్యాలని ఆమదాలవలస నియోజకవర్గ జనసెన ఇంచార్జ్ పెడాడ రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు.
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ లో భారీ ఎత్తున నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు జనసెన దృష్టికి తీసుకు రావడం తో ఆయన శనివారం పరిశీలించారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కావలి, వాల్తేరు, పనసపేట తదితర ప్రాంతాల ప్రజలు, శ్రీకాకుళం జిల్లాలోని బెలమాం, లొద్దలపేట, తాడివలస, గండ్రేడు, లత్సయ్యపేట, గోరింట, గోకర్ణపల్లి, వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో నిరంతరం శ్రీకాకుళం పట్టణానికి రాకపోకలు సాగిస్తూ అండర్ పాస్ వరకు వచ్చి మరలా వెనుకకు వెళ్లి పొందూరు మీదుగా శ్రీకాకుళం చేరడానికి కొన్ని గంటల సమయాన్ని వృధాచేసుకొనే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడటం బాధాకరం అన్నారు.దీంతో రైల్వే అధికారులను అండర్ పాస్ లో చేరిన నీరు నాగావళి నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కాకపోవడంతో ఈ తీవ్ర సమస్య ఏర్పడుతుందని, రైల్వే అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్, మండల నాయకులు పొన్నాడ బాలకృష్ణ, యశ్వంత్, నాయుడు, రాజు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img