Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీఎం ని కించపరిచేలా మాట్లాడుతున్న లోకేష్ పై చర్యలు తీసుకోండి

జడ్పిటిసి సభ్యులు వసికేరి తేజ రమేష్

విశాలాంధ్ర -ఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మరియు నారా లోకేష్, సైకో అంట వ్యాఖ్యలు చేస్తున్నారని ఇవి వైయస్సార్ పార్టీ నాయకుల కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వీరిద్దరిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వజ్రకరూరు జడ్పిటిసి సభ్యులు తేజేశ్వరి, మరియు కురుబ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు వసికెరి రమేష్ బాబు శనివారం అనంతపురంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి సైకో పాలన పోవాలి సైకిల్ రావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పాట రూపంలో కూడా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఈ పాటను తక్షణమే బ్యాన్ చేయాలన్నారు ఇలాంటి వాటిని రూపొందిస్తున్న ఐటీడీపీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున పటాస్ శ్రీకాంత్, గోవర్ధన్ రాయల్, నవీన్ కుమార్ లోకేష్ బండి కాశి నార్పల శంకర్

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img