రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగరవేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సేవ్ ధర్మవరం అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆరో వార్డు కేశవ నగర్ లో వారు పర్యటించారు. అక్కడి ప్రజలు కూడా చిలకమ్మ మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మూడు సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల భారీ నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదేనని వారు తెలిపారు. ధర్మవరంలో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, చేనేతలను ఆదుకోకపోవడంతో బలవంతంగా మరణించడం చాలా బాధాకరమని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చేనేత కార్మికులకు అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయని, ప్రజలు భయపడవలసిన పని లేదని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ సమస్యల్లో తాను షేవ్ ధర్మవరం కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఎన్నో సమస్యలు నా దృష్టికి వస్తున్నాయని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో తెలిపి, అధికారుల ద్వారా పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఇన్చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.