Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అభివృద్ధి పనులు కోసం నిధులు కేటాయించాలి

సిపిఐ ఎంపీటీసీ సభ్యుడు నిరసన
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్‌ గ్రామపంచాయతీలో 16,17 వార్డులలో తాను గెలుపొందిన తొమ్మిదవ ఎంపిటిసి స్థానంలో అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకుండా అధికారులు పక్షపాతి ధోరణి చూపిస్తున్నారని సిపిఐ పార్టీ ఎంపీటీసీ సభ్యులు జి. వ న్నూరు సాహెబ్‌ మండల సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుని ప్లే కార్డు పట్టుకొని నిరసన తెలిపారు. సోమవారం ఎంపీపీ చంద్రమ్మ అధ్యక్షతన మండల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీల కు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగిందని తన పరిధిలో ఉన్న వార్డులకు ఎందుకు నిధులు కేటాయించలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. 9వ ఎంపీటీసీ స్థానం పరిధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, విద్యుత్తు, తాగునీటి సమస్యలు నెలకొన్నాయని వాటి పరిష్కారానికి తక్షణ నిధులు కేటాయించాలన్నారు. నిరసనపై ఎంపీడీవో అమృత రాజు స్పందిస్తూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఎంపీటీసీ సభ్యుడు నిరసన విరమించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img