Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉచిత వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘం

విశాలాంధ్ర ^ధర్మవరం : పట్టణంలోని తొగటవీధిలోగల శ్రీ సీతారామ దేవాలయ ప్రాంగణమునందు ఈనెల 25వ తేదీన శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవాలయం ఆధ్వర్యంలో 83వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 83వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి శిబిరానికి దాదాపు 300 మంది రోగులు వచ్చి వైద్య చికిత్సలను చేయించుకుని, ఒక నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు తల్లి పాలగిరి సుశీలమ్మ, భార్య నాగలక్ష్మిల జ్ఞాపకార్థం పి. నాగభూషణం వ్యవహరించడం జరిగిందన్నారు. శిబిరంలో వైద్యులుగా వివేకులాయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్ ,జై దీపు నేత, మహేష్ సిన్హా లు వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందన్నారు. కావున పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img