Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసులో నిందితులను అరెస్టు చేశారు.పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప మాట్లాడుతూ 9 మంది నిందితులను, రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం హత్యకు ఉపయోగించిన పిడిబాకు హార్డ్ డిస్క్ బూడిదలను గుంతకల్లు డిఎస్పి నర్సింగప్ప స్వాదినం చేసీ వెల్లడించినట్లు తెలిపారు.మరో ఆరు మంది నిందితులు పరారీలో ఉన్నట్లు డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు.గత 30 సంవత్సరాల గా ఉన్న ఆస్తివివాదాలే హత్యకు కారణాలుగా వెల్లడించారు.వారం రోజులుగా రెక్కీ నిర్వహించిన అనంతరం సాయంత్రం 6 సమయంలో హత్యకు పాల్పడినట్లు తెలిపారు.గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ దేవాలయం సమీపంలో తలదాచుకున్నట్లు తెలుసుకొని వలపని నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.మరో ఆరు మంది నిందితులను త్వరలోనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామని పేర్కొన్నారు.కేవలం ఐదు రోజులలోనే హత్య కేసు చేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐలు గణేష్ ,రామసుబ్బయ్య, ఎస్ఐ తిరుపాల్, జమేదార్ వెంకటేష్, కానిస్టేబుల్ చిరంజీవి తోపాటు ఇతర సిబ్బందిని అభినందించిన పోలీసు ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img