Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

నామినేషన్ కార్యక్రమానికి తరలిరండి

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి

విశాలాంధ్ర-ఉరవకొండ : వైయస్సార్ సిపి బలపరుస్తున్న రాయలసీమ పశ్చిమ పట్టభద్ర నియోజక వర్గ అభ్యర్థి వెన్నపూసల రవీంద్రారెడ్డి, మరియు ఉప్యాధ్యాయ అభ్యర్థి రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమము ఈనెల 22 బుధవారము ఉదయము 11.00 గంటలకు ఉంటుందని ఈ కార్యక్రమంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ పశ్చిమ రాయలసీమ జిల్లాలలోని పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయు ఎన్నికల వైఎస్ఆర్సిపి పరిశీలకులు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉరవకొండ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన సమర్థులైన రవీందర్ రెడ్డి కి మరియు రామచంద్ర రెడ్డి కి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img