విశాలాంధ్ర` ధర్మవరం : పట్టణ ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, నేటి వైయస్సార్ ప్రభుత్వములో ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం’’ఇదేం కర్మ- మన రాష్ట్రానికి’’కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒకటవ, రెండవ వార్డులలో పరిటాల శ్రీరామ్తో పాటు నాయకులు, కార్యకర్తలు ఇన్చార్జి నాయకులు పర్యటించారు. వార్డులలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉందన్నది వారు ఆరా తీశారు. నిరుద్యోగ సమస్య, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ధరల భారం, విద్యుత్ జార్జీల భారంపై నేడు ప్రజలు ఎన్నో అవస్థలు పడుతుంటే, వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం తాఖీ తాకినట్లు ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, చేనేత కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, చేనేత ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం, చేనేత వ్యాపారం తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో కార్మికులు నలిగిపోతున్నారని తెలిపారు. నేతన్న నేస్తం అసలైన అర్హులైన చేనేత కార్మికులకు అందలేదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.. పాలకవర్గాల మాట వినలేదని నేడు వివిధ ప్రభుత్వ శాఖలో ఉన్న అధికారులు సెలవులపై వెళ్లడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం గౌడ్, కమతం కాటమయ్య, పరిసే సుధాకర్, పని కుమార్, మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, బోయ రవిచంద్ర, బిరే శ్రీనివాసులు, గొట్లురు అనిల్, సాహెబ్బి, బిబి లతోపాటు అధిక సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.