Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పేదల పక్షపాతి సిపిఐ

విశాలాంధ్ర.. ఉరవకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షపాతిగా కొనసాగుతుందని ఆ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గన్నే మల్లేష్ అన్నారు. పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. గత 97 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ పేద,,బడుగు, బలహీన, కార్మిక కర్షక వర్గాల వైపు అలుపెరగని పోరాటాలను నిర్వహించి ఎన్నో విజయాలను సాధించిందని ఆయన సందర్భంగా కొనియాడారు. ప్రజాస్వామ్య నైతిక విలువలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా సిపిఐ పార్టీ పట్ల ఆకర్షితులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి జె.మల్లికార్జున, జిల్లా కార్మిక సంఘం నాయకులు చెన్నారాయుడు,సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్ వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు తలారి మల్లికార్జున,రమేష్తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img