కృష్ణాజిల్లా గుడివాడలో మట్టి మాఫియాపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. మట్టి తరలింపును అడ్డుకునేందుకు యత్నించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏకంగా జేసీబీతో కొట్టి హత్య చేసేందుకు యత్నించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ఐపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.దీంతో తాజాగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్ఐ అరవింద్పై దాడికి దిగిన 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, మట్టి తవ్వకాలకు వినియోగిస్తున్న జేసీబీని సీజ్ చేశారు. అంతేకాకుండా మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్న 3 ట్రాక్టర్లను కూడా అధికారులు సీజ్ చేశారు.