: చంద్రబాబు
స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి వంటివారు జగన్ ను ఇంతగా ప్రాధేయపడాలా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్ కించపరిచారని ఆగ్రహం వ్కక్తంచేశారు. ప్రత్యేకహోదాపై మీ యుద్ధం ఏమైందని ప్రశ్నించారు.హోదా కోసం రాజీనామాలు చేయాలంటూ ఆనాడు మీరు విసిరిన సవాళ్లు ఏమయ్యాయని అడిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు జగన్ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండు చేశారు. ఎజెండాలో ప్రత్యేక హోదా తమ ఘనతే అని చెప్పుకుని ఇప్పుడు తమ బురద జల్లుతారా అని ప్రశ్నించారు. ఏపీ ఆదాయం బాగున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు సరఫరా సక్రమంగా లేకపోయినా అధిక కరెంటు బిల్లులు వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.