అధికారులను ఆదేశించిన సీఎం జగన్
నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.క్లాప్ కార్యక్రమం కింద ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు సూచించారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రేడ్-2, 3, నగరపంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, పంచాయతీలకు చేరవేయాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్ను వీలైనంత తర్వగా తెప్పించుకోవాలని సూచించారు.ఎలక్ట్రిక్ వెహికల్స్ను వీలైనంత తర్వగా తెప్పించుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో డస్ట్బిన్స్ లేని వాళ్లకు డస్ట్బిన్స్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలని సూచించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా తాగునీటి వాటర్ ట్యాంక్లను పరిశుభ్రం చేయించాలన్నారు. మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలన్నారు. క్లాప్ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ రూపంలో సమర్థులైన అధికారులను పెట్టాలని, అక్కడికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.