ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,525 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,174 మందికి వైరస్ సోకినట్లు తేలింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2037353కి చేరింది. మహమ్మారిబారిన పడి గడిచిన 24 గంటల్లో 9 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14061 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,309 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2008639కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14653 యాక్టివ్ కేసులున్నాయి.