టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై స్పందించారు. ఈ కేసును సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వివేకా కేసులో సాక్షులను బెదిరించే యత్నాలు జరుగుతున్నాయని అన్నారు. జగన్ను అరెస్టు చేసి కేసు లోగుట్టును సీబీఐ వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ, వివేకా హత్యకేసును తప్పుదోవ పట్టించడంలో జగనే దోషి అని చెప్పారు. వివేకా హత్య వెనుక జగన్ సకుటుంబ సపరివార సమేత కుట్ర ఉందని అన్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత టీడీపీ తరఫున పోటీ చేస్తుందని సజ్జల అనడం హేయమైన విషయం అని, అడ్డగోలుగా మాట్లాడడం సజ్జలకు తగదని హితవు పలికారు.