కడపజిల్లాలో సీకే దిన్నె మండలం మద్దిమడుగులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటి గడప దగ్గర మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న వారిపైకి ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మృతులను దేవి (27), అమ్ములు (30), అమ్ములు భర్త కొండయ్య (45), లక్ష్మీదేవి (35)గా గుర్తించారు. వాళ్లంతా కొండయ్య ఇంటి గడప మీద కూర్చుని మాట్లాడుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కొండయ్య, లక్ష్మీదేవి ఘటనా స్థలంలోనే మరణించగా.. అమ్ములు, దేవిలను కడప రిమ్స్ కు తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.